పీలేరు అభివ్రుద్దికి ప్రత్యేక ప్రణాళిక..


Ens Balu
2
Pileru
2020-12-26 21:50:11

పీలేరు నియోజకవర్గ సమ గ్రాభివృద్దికి కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రా మీణాభివృద్ది శాఖా మాత్యు లు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. శనివారం పీలేరులో రూ. 24 కోట్లతో నిర్మించనున్న100 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణా భివృద్ది శాఖామాత్యులు మరియు రాజంపేట పార్ల మెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, పీలేరు శాసన సభ్యులు చింతల రామ చంద్రా రెడ్డి, తంబళ్ళపల్లి శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిల తో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజల నుద్దేశించి మంత్రి మాట్లా డుతూ పీలేరు లో 100 పడ కల ఆసుపత్రి నూతన భవ న నిర్మాణమును ఒక సంవ త్సరంలో పూర్తి చేస్తామని, ఈ ఆసుపత్రి నిర్మాణానికి భూమిని ఇచ్చిన దాతలను ఈ సందర్భంగా మంత్రి  అభి నందించారు.  పీలేరు లో త్రా గు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామ ని తెలిపారు.పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది  శాఖ ద్వారా రూ.97 కోట్ల 70 లక్షలు వివిధ అభివృద్ది పను లకు మంజూరు చేయగా, త్రాగునీటి సమస్య పరిష్కా రానికి రూ. 19 కోట్ల 17 లక్ష లు మొత్తం దాదాపు గా రూ. 120 కోట్లు మంజూరు చేసి నట్లు తెలిపారు.రాష్ట్ర ము ఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల కష్టాల ను తెలుసుకొని అందుకు అనుగుణంగా ఎన్నికల మ్యానిఫెస్టోను  రూపొం దించి అధికారంలోని వచ్చిన 18 నెలలలో 90 శాతం ఎ న్నికల హామీలను అమలు చేయడం జరిగిందని  తెలి పారు.రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ సంవత్సరం 15 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను ప్రా రంభించడం జరుగు తుంద ని తెలిపారు.పాడి  రైతుల కు మేలు చేకూర్చేలా లీటర్ కు రూ .4 ప్రోత్సాహకం అందించడం జరుగుచున్న దని, గ్రామ సచివాలయ వ్య వస్థ ద్వారా ప్రభుత్వ సేవల ను ప్రజల ఇంటి ముంగిటికే తీసుకొని రావడం జరిగిం దని, భారత దేశం లో ఈ రాష్ట్ర లో లేని విధంగా 50 ఇండ్ల కు ఒక వాలంటీర్ ను నియామకం చేయడం జరి గిందని,ఈ వాలంటీర్ వ్యవ స్థ ద్వారా ప్రతి నెల ఒకటవ తేదీన 98 శాతం పెన్షన్ పం పిణీ జరుగుచున్నదని,4,4 00 జబ్బులకు ఆరోగ్య శ్రీ వర్తింప చేయడం జరిగిం దని, అమ్మ ఒడి,వై.ఎస్. ఆర్ ఆసరా, చేయూత, జగ నన్న విద్యాదీవేన, వసతి దీవెన ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదని తెలిపారు.           రాజంపేట పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ పీలేరు ప్రజల చిరకాల వాంఛ అయిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కల సాకారం అవ్వడానికి పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్రా రెడ్డి కృషి ఎక్కు వగా కలదని తెలిపారు. మదనపల్లి-తిరుపతి నాలు గు వరసల రోడ్ నిర్మాణ పనుల మంజూరుకు కేంద్ర మంత్రి నితిన్ గట్కరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్  రెడ్డి గారి ద్వారా లేఖను అందజేశామని, కేం ద్ర మంత్రి వర్యులు ఈ విష యమును అతి ముఖ్యమై నదిగా గుర్తించాలని కోరా మన్నారు. పార్టీలకు అతీ తంగా అన్నీ వర్గాల సంక్షే మానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తు న్నదని,కబ్జాకు గురైన ప్రభు త్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని  పారద ర్శకంగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుచున్నదని తెలిపారు.                   పీలేరు శాసన సభ్యులు మాట్లాడుతూ పీలేరు లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చరిత్రలో మైలు రాయి అని, ఈ ఆసుపత్రి ద్వారా ఆర్థో,ఈ ఎన్ టి, డెర్మటాలజీ, రేడియాలజీ, పాథాలజీ, జనరల్ మెడి సిన్, గైనకాలజీ, పిడియా ట్రిషన్, అనస్తీషియా, డెం టిల్, జనరల్ సర్జరి విభా గాలలో సేవలు అందించడం జరుగుతుందని, ఈ ఆసుప త్రి భవన నిర్మాణ పనులను ఒక సంవత్సరంలో పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపారు. పీ లేరులో 6,500 ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరుగు చున్నదని, ఇళ్ల పట్టాల పం పిణీ కార్యక్రమంలో ప్రజ లు ఎవరు దళారులను ఆశ్ర యించవద్దని, పారదర్శ కంగా వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ జరుగు తుందని తెలిపారు. పీలేరు లో త్రాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అడవి పల్లి రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా చేసేం దుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఐ టి ఐ కళాశాలకు  శాశ్వత భవనమును మం జూరు చేయాలని మంత్రిని కోరారు.          తంబళ్ళపల్లి శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు ద్వారా అన్నీ వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుచున్నదని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ, డి సి హెచ్ ఎస్ లు డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ సరళమ్మ, ఏపిఇ ఐ డి సి ఎస్సీ  ధనంజయ రెడ్డి, పీలేరు ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, సింగల్ విండో ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, డి సి సి బి డైరెక్టర్ స్టాంపుల మస్తాన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గిరిధర్, ఏ జి ఎం ఎస్ ఐ డి  ఛైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి, ఎంపీడిఓ జయరాజ్, ఎం ఆర్ ఓ  పుల్లా రెడ్డి, నాయకులు ఇక్బాల్  అహమ్మద్, అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.