శ్రీకాకుళం జిల్లాలో స్పందనకు 43 వినతులు..
Ens Balu
3
Srikakulam
2020-12-28 18:36:19
శ్రీకాకుళంజిల్లాలో స్పందన కార్యక్రమానికి 43 వినతులు వచ్చాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖకు సంబంధించి 17 వినతులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 3 వినతులు, ఇతర శాఖలకు సంబంధించి 23 వినతులు వచ్చాయని తెలిపారు. కరోనా వైరస్ ఉద్రుతి వలన ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 43 మంది ఫోన్ చేసి తమ ఫిర్యాదులను తెలియజేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయపు హెచ్ సెక్షన్ నుండి జె.చలమయ్య, స్పందన విభాగం సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.