30న గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం..
Ens Balu
3
Srikakulam
2020-12-29 16:16:27
శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ ఉదయం 10.30గం.లకు సంయుక్త కలెక్టర్ ( విడబ్ల్యుయస్ అండ్ డి ) మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇన ఛార్జ్ వారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించబడుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో 2020-21 సం.నకు నూతన పుస్తకాలు కొనుగోలు, జిల్లా కేంద్ర గ్రంధాలయం, జిల్లా గ్రంధాలయ సంస్థ మరియు అన్ని శాఖా గ్రంధాలయాలకు అవసరమైన ఫర్నిచర్ , కంప్యూటర్లు, ఎయిర్ కండీషనర్లు కొనుగోలు, జిల్లా కేంద్ర గ్రంధాలయం అదనపు భవన నిర్మాణం, జిల్లా కేంద్ర గ్రంధాలయం కాంపౌండ్ వాల్ , ఆమదాలవలస శాఖ గ్రంధాలయం మరామ్మతులు వంటి పనులు ప్రతిపాదనలు ఆమోదం కొరకు చర్చించడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.