నేడు జాతీయ వినియోగదారుల వేడుకలు..
Ens Balu
2
Srikakulam
2020-12-29 16:18:31
శ్రీకాకుళం జిల్లా జాతీయ వినియోగదారుల వారాంతపు వేడుకలను నేడు నిర్వహిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ వినియోగదారుల వారోత్సవ వేడుకలను ఈ నెల 24 నుండి నిర్వహిస్తున్న సంగతి అందరికి విదితమే. అందులో భాగంగా జిల్లాస్థాయిలో వారాంతపు వేడుకలను డిసెంబర్ 30 ఉదయం 11.00గం.లకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల రక్షణ చట్టం – 2019 – కార్యాచరణ ప్రణాళికపై చర్చించడం జరుగుతుందని జె.సి స్పష్టం చేసారు.