శ్వేతా భవనాన్ని సందర్శించిన దేవిరెడ్డి శ్రీనాధ్..
Ens Balu
2
Tirupati
2020-12-29 17:21:30
తిరుపతి పర్యటన లో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ శ్రీ పద్మావతి అతిధి గృహం సమీపం లోని శ్రీ వెంకటేస్వర ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడమీని ( శ్వేతా బవనము) సందర్శించారు. ఈ సందర్భంగా శ్వేతా భవన్ డైరెక్టర్ డా.రామాంజనేయ రెడ్డి చేర్మన్కు బొకే అందచేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ గౌరవ చేర్మన్ శ్వేతా బవనము లోని కాంటీన్ అలాగే ఆన్లైన్ లో కోవిడ్ అవగాహన పై టీ.టీ.డీ. ఉద్యోగులకు ఇచ్చే వీడియో కాన్ఫెరెన్స్ ను పరిశీలించారు. అలాగే శ్వేతా భవన్ డైరెక్టర్ గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్వేతా భవన్ డైరక్టర్ డా.రామాంజినేయ రెడ్డి చేర్మన్ కు శాలువా కప్పి, శ్రీ వేంకటేశ్వరస్వామి స్వామివారి చిత్రపటం అందచేసి శ్రీవారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో శ్వేతా బవనము సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.