వైఎస్సార్ చేయూతకు సహకరించండి..


Ens Balu
3
Srikakulam
2020-12-29 20:26:17

వైఎస్సార్ చేయూత లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు.  మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో వై ఎస్ ఆర్ చేయూ త పధకం పై కన్వెర్జెన్స్ మీటింగ్ జరిగింది. చేయూత లబ్ధిదారులకు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల యూనిట్ లను త్వరిత గతిన అందచేయాలన్నారు. మంచి పశువులను కొనుగోలు చేయాలి అన్నారు.   పాల సేకరణకు వందగ్రామాలను గుర్తించాలని తెలిపారు. పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణo రైతు భరోసా కేంద్రాల వద్ద నిర్మిo చాలని, ఒక్కో కేంద్ర నిర్మాణానికి రూ.16లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా లో 650 పాల సీతలీకరణ కేంద్రాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాల సేకరణ, ట్రాన్స్ పోర్ట్, తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించి, లక్ష్య సాధన కు కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జె సి లు  సుమీత్ కుమార్, ఆర్. శ్రీరాములు నాయుడు, డి ఆర్ డి ఎ  పిడి  బి. శాంతిశ్రీ, పశు సంవర్ధక శాఖ జె డి ఎ. ఈశ్వర్ రావు, పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఆర్. కె. భాస్కర్, ఎల్ డి ఎం హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.