సీఎం వైఎస్ జగనన్న వెంటే మహిళామణులు..


Ens Balu
3
Visakhapatnam
2020-12-30 15:26:35

ఏపీ సీఎం వైఎస్ జగనన్న మహిళల అభివ్రుద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మహిళా విభాగం రాష్ట్రకార్యదర్శి జి.రోజారాణి ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు. మంగళవారం వైఎస్ జగనన్న మహిళా మణుల సైన్యం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఈ వైఎస్సార్సీపీ సాంస్క్రుతిక విభాగం అధ్యక్షురాలు రాధను ఘనంగా సత్కరించారు. అనంతరం కార్పోరేషన్ డైరెక్టర్లు యువశ్రీ, సమీరాబేగంలతో కలిసి  ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగనన్న మహిళలను అన్నిరంగాల్లో ముందుంచాలనే లక్ష్యంతో కార్పోరేషన్ పదవుల్లో 50శాతం మమిళలకు డైరెక్టర్ పదవులు కల్పించారని కొనియాడారు. మహిళా లోకమంతా జగనన్న వెంటే వుంటుందని ఈ సందర్భంగా మహిళలంతా ముక్తకంఠంతో చెప్పారు.  రాష్ట్రం లో ప్రతీ మహిళ  జగనన్నను తన కుటుంభ సభ్యుడుగా భావిస్తున్నారన్నారు. మహిళా మణులు తమ కార్యక్రమాలను తరుచూ నిర్వహించాలని ఈ సందర్భంగా తీర్మాణించినట్టు రోజారాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజవర్గం వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రతినిధులు జుట్టు లక్ష్మి, తదిరులు పాల్గొన్నారు.