శ్రీక్రిష్ణ పరమాత్ముడు కృపతోనే జీవకోటి మనుగడ..గంట్ల
Ens Balu
2
Visakhapatnam
2020-08-11 14:15:59
శ్రీక్రిష్ణ పరమాత్ముడు కృపతోనే జీవకోటి మనుగడ సాధ్యపడుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. విశాఖలోని సాగర్ నగర్ ఇస్కాన్ దేవాలయంలో మంగళవారం శ్రీ కృష్ణుడి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల సతీసమేతంగా క్రిష్ణభగవానుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల మీడియాతో మాట్లాడుతూ, మానవ సమాజం మనుగడ శ్రీక్రిష్ణుడి లీలతోనే నడుస్తుందన్నారు. కరోనావైరస్ నుంచి కాపాడాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరు స్వామిని పూజించి క్రిష్ణుడి క్రుపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంవీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.