మెడికల్ కిట్ల వ్యవహరాంలో మెడికల్ ఆఫీసర్ సస్పెన్షన్..
Ens Balu
4
Kakinada
2020-08-11 14:54:39
ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇస్తోన్న ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను పక్కదారి పట్టిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి కఠిన చర్యలు తీసుకున్నారు. కాకినాడ కార్పోరేషన్ పరిధిలో కిట్లు పక్కదారి పట్టినట్టు అధికారులు గుర్తించి కలెక్టర్ కు నివేధించడంతో మెడికల్ ఆఫీసర్ కరీముల్లా ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు మరో హెల్త్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ ను మాతృసంస్థకు బదిలీ చేశారు. కోవిడ్ కిట్ల మాయాజాలంపై పూర్తి స్థాయి విచారణ చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలకి కలెక్టర్ ఆదేశించడంతో.. జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకం ఫోర్జరీ చేసి 300 కిట్లు తీసుకుని వెళ్లినట్టుడిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరీ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనతో ఎంఎన్ఓ బాషాకి లింకులున్నట్టు గుర్తించడంతో బాషా ప్రస్తుతం పరారీలో ఉన్నారు..