జనవరి 2న వినియోగదారుల హక్కులపై సదస్సు..
Ens Balu
3
Srikakulam
2020-12-31 14:21:24
శ్రీకాకుళం జిల్లాలోని బి.యస్.యన్.ఎల్ టెలికామ్ బిజినెస్ ఏరియా ఆధ్వర్యంలో జనవరి 2న ఉదయం 11.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు ఆన్ లైన్ లో వినియోగదారుల హక్కులు, బిఎస్ఎన్ఎల్ సేవలపై అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు టెలికామ్ జనరల్ మేనేజర్ జె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఆన్ లైన్ సదస్సులో ట్రోయ్ ( TRAI ) లో రిజిష్టర్ అయిన కన్జ్యూమర్ అడ్వకసి గ్రూప్ మెంబర్స్ పి.చిట్టిబాబు, బి.సంజీవరాయుడు, గంగాధరమ్ పాల్గొంటారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వినియోగదారులు ఆన్ లైన్ సదస్సులో పాల్గొని తమ సమస్యలు, సలహాలను తెలియజేయవచ్చని ఆయన తెలిపారు. ఆన్ లైన్ సదస్సులో పాల్గొనదలచిన ttps://meet.google.com/vjj.rrtc.ifg లింక్ ద్వారా పాల్గొనవచ్చని వివరించారు. ఇతర సందేహాల కొరకు AGM ( Plg ) 94904 06455 మొబైల్ నెంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.