142 జిఓ ప్రకారంమే జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు..
Ens Balu
3
Chittoor
2020-12-31 20:37:52
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2021-2022 కాల పరిమితి కి సంబంధించి అర్హత ఉన్న జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రిడి టేషన్ ల మంజూరుకు ప్రాథమిక సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క అక్రిడిటేషన్ దరఖాస్తు ను కూడా రిజెక్ట్ చేయలేదని, జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 142 లో ఉన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించి అర్హులందరికీ అక్రిడిటేషన్ మంజూరు చేస్తామని తెలిపారు.. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలోని జర్నలిస్టుల కు అర్హతలను పరిశీలించి అక్రిడిటేషన్ మంజూరు చేయడం జరుగుతుం దన్నారు.
అక్రిడిటేషన్ మంజూరు కానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర సమాచార శాఖ ఆన్ లైన్ /వెబ్ సైట్ ను రీ ఓపెన్ చేసిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆ కాపీలను సమాచార పౌర సంబంధాల శాఖ, చిత్తూరు కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. అనం తరం అప్లోడ్ చేసిన దరఖాస్తులను పరిశీలన చేసి వెంటనే రెండవ విడత సమావేశంలో అర్హత ఉన్న వారికి అక్రిడిటేషన్ మంజూ రు చేయడం జరుగుతుం దన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి మెంబెర్ కన్వీనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లాల్ జాన్ బాషా, సభ్యులు డిఎంహెచ్ఓ, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలు నాయక్, హౌసింగ్ పిడి పద్మనాభం, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.