మంత్రి అవంతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువ..


Ens Balu
3
Visakhapatnam
2021-01-01 19:14:56

విశాఖ సితమ్మధార లోని మంత్రి వర్యులు క్యాంప్ కార్యాలయంలో.. నూతన సంవత్సర సందర్భంగా గా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది , క్రిడా శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని కలసి అధిక సంఖ్యలో అధికారులు, నాయకులు కలసి.. పుష్పగుచ్చం అందించి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు.  జిల్లాలోని ఉన్న చాలా మంది ప్రముఖులు ,  అధికారులు,  నాయకులు అనేక ప్రాంతాల నుంచి అభిమానులు పార్టీ శ్రేణులు  కార్యకర్తలు అభిమానులు వివిధ సంఘాల నాయకులు ఉదయం నుంచి తండోపతండాలుగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు  సంఘాల నాయకులు వార్డు అధ్యక్షులు కార్పొరేటర్ అభ్యర్థులు , నాయకులు ప్రజలు , అధికారులు ప్రతిఒక్కరు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి  శుభాకాంక్షలు తెలియజేశారు`. మంత్రి వర్యులను కలసి శుభాకాంక్షలు తెలియచేసిన వారిలో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, నగర అధ్యక్షులు వంశీకృష్ణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విజయ ప్రసాద్,  DMHO, PD DRDA, ZP CEO, Special Deputy collector, SE (PR), SE (RWS), విశాఖ ఆర్డీవో, అనకాపల్లి ఆర్డీవో,  తదితరులు ఉన్నారు. అనంతరం వీఎంఆర్డీఏ కార్యాలయంలో వద్ద రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారిని కలసి.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు.అనంతరం భీమిలీ నియోజకవర్గ లో మంత్రి వర్యులను కలసిన వారిలో   జోనల్ కమీషనర్ గోవిందరావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెద్దబాబు,  నియోజకవర్గంలో ఉన్న  మండల అధికారులు , ఎంపిపి  అభ్యర్దులు, కార్పొరేట్ ర్ అభ్యర్దులు, స్థానిక నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.