ఇళ్ల పట్లాల కోసం డబ్బులు వసూలు చేస్తే ఉద్యోగం కట్
Ens Balu
3
Guntur
2020-08-11 21:18:25
జగనన్న ఇళ్ళ స్థలాల ఎంపిక ప్రక్రియలో ఎవరైనా చేతివాటాన్ని చూపితే సహించేది లేదని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ హెచ్చరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలం కోసం ఎంపికైన లబ్దిదారులు 21 రూపాయలు మాత్రమే చెల్లించి వార్డు సిబ్బంది నుండి రశీదు పొందాలన్న ఆమె అదనంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే జీఎంసీ కాల్ సెంటర్ 0863-2345103 / 104 / 105 నెంబర్లలో పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయాలని చెప్పారు. గుంటూరు నగరంలోని 207 వార్డు సచివాలయాల పరిథిలో 62,025 మందికి ఇళ్ళ స్థలాల పట్టాలు మంజూరైనట్లు తెలిపారు. డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిస్తే సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.