ముందు మీరేంటో తెలుసుకొని మాట్లాడితే మంచిది...
Ens Balu
3
Visakhapatnam
2020-08-11 23:07:34
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద,పార్టీ నాయకులు మీద విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బి. కాంతారావు అన్నారు. మంగళవారం వైయస్సార్ విద్యా విభాగం అధ్యక్షుడు బి. మోహన్ బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దళితులకు హోం మంత్రి పదవి ఇవ్వడం ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇవ్వడం డిప్యూటీ సీఎం పదవి దళిత వర్గానికి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దళితులపై చూపిస్తున్న అభిమానాన్ని వెలగపూడి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విమర్శించడం సిగ్గుచేటన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ని ఉద్దేశించి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ నోటికొచ్చినట్లు స్థాయిని మరచి మాట్లాడటం హేయమైన చర్య అన్నారు. గతంలో దిష్టిబొమ్మ దహనం చేయడానికి వచ్చినప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నా నీకు దేహశుద్ధి జరిగిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ కరోనాకు భయపడి హైదరాబాదులో తల దోచుకున్నారని కానీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ట్రస్ట్ పెట్టి 25 సంవత్సరాల యువకుడిలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు నీషేక్, కె.ప్రసాద్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.