ఆశాలకు వైఎస్సార్ చేయూత అమలు చేయాల్సిందే..


Ens Balu
3
Visakhapatnam
2020-08-12 13:32:31

ఆశాలకు వై.ఎస్‌.ఆర్‌. ‌చేయూత పథకానికి అనర్హులను చేయడం, ఇతర సంక్షేమ పథకాలు వర్తింప చేయకపోవడం దారుణమని ఆశా వర్కర్స్ ‌యూనియన్‌ ‌జిల్లా వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ఎస్‌.అరుణ, విశాఖ నగర అధ్యక్షరాలు వి.మేరీ ఆరోపించారు. అందరి మహిళలు మాదిరిగానే ఆశ లకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.  పై ఈ రోజు జగదాంబ జంక్షన్‌ ‌వద్ద గల సిఐటియు కార్యాలయం ఆవరణలో ఆశ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, సు ర్ఘకాలం పోరాడిన తరువాత ఆశాలకు 10 వేల రూపాయల జీతం పెంచిన ప్రభుత్వం, జీతం పెరిగిందనే నేపంతో నేడు మహిళలకు ప్రభుత్వం ప్రకటించిన వై.ఎస్‌.ఆర్‌. ‌చేయూత పథకానికి అనర్హులుగా చేయడం అన్యాయమని అన్నారు.  ఈ పథకం ఆశాలకు ఎంతో అవసరమన్న వీరు ఆశాలలో అత్యధిక మంది దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారన్నారు.  వీరిలో ఎక్కువ మంది వంటరి మహిళలుగా ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నారని కూడా తెలియజేశారు.  అత్యంత పేదరికంలో మగ్గుతూ 14 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చే పారితోషికానికి కట్టుబడి వైద్య రంగంలో క్రింది స్థాయిలో పనిచేశారు. జగన్‌ అన్న వచ్చిన తరువాత 10 వేలు రూపాయలు వేతనాన్ని నిర్ణయించారు. వై.ఎస్‌.ఆర్‌. ‌చేయూతతో పాటు అనేక చోట్ల రేషన్‌కార్డులు, పించన్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా నిలుపుదల చేయడాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతంలో పేదలకు 12 వేలు లోపు ఆదాయం ఉన్నవారికి బియ్యం కార్డు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం, ఆశాలకు 10 వేలు పారితోషికం వస్తున్నా మ పథకాలకు అనర్హులను చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆశాలకు వైఎస్‌ఆర్‌ ‌చేయూత, ఇతర సంక్షేమ పథకాలన్నీ ఆశాలకు వర్తింపచేస్తూ ఉత్తర్వులు ఇచ్చి ఆశాలను ఆదుకోవాలని ఆశలు కోరారు.
సిఫార్సు