డయల్ యువర్ కమిషనర్ కు 27 ఫిర్యాదులు..


Ens Balu
2
Visakhapatnam
2021-01-04 19:08:04

మహా విశాఖ నగర పాలక సంస్థ నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులు, అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. సోమవారం జి.వి.ఎం.సి.  ప్రధాన  కార్యాలయం లో  డయల్  యువర్ కమిషనర్ కార్యక్రమంలో , టోల్ ఫ్రీ నం.1800-4250-0009 ద్వారా  నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఇందులో ఒకటవ జోనుకు 04, రెండవ జోనుకు 06, మూడవ జోనుకు 03, నాల్గవ జోనుకు 02, అయిదవ జోనుకు 06, ఆరవ జోనుకు 05, ఇతరులు 01, మొత్తము 27 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు రమణి, సన్యాసిరావు, సి.సి.పి.విద్యుల్లత, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక తదితరులు పాల్గొన్నారు.