5న శ్రీకాకుళంలో మంత్రి పేర్నినాని పర్యటన..


Ens Balu
2
Srikakulam
2021-01-04 19:51:09

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య ( నాని ) మంగళవారం శ్రీకాకుళం జిల్లాకు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి మంగళవారం ఉదయం 11.00గం.లకు శ్రీకాకుళంకు చేరుకుంటారని అనంతరం అక్కడి నుంచి అరసవల్లి, శ్రీకూర్మంలోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 03.00గం.లకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి విశాఖపట్నంకు వెళతారని కలెక్టర్ వివరించారు. మంత్రి రాక సందర్భంగా అధికారికంగా అన్ని ఏర్పాట్టు చేసినట్టు కలెక్టర్ వివరించారు.