రుపేదల దేవుడు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి..
Ens Balu
2
Kurnool
2021-01-04 20:06:20
రాష్ట్రంలో నిరుపేదలకు సొంతింటి స్వప్నాన్ని సాకారం చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అందజేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఏ.హాఫిజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. సోమవారం నవరత్నాలు--పేదలందరికీ ఇళ్లు పథకం అమలులో భాగంగా కర్నూలు మునిసిపల్ కొర్పొరేషన్ పరిధిలోని 10, 11, 12, 13వ వార్డులకు లబ్ధిదారులకు పాతబస్తీలోని ఖడక్ పుర మైదానంలో, 22, 23, 24, 25 వ వార్డుల లబ్ధిదారులకు వినాయక్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ సొంతింటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ..అక్కచెల్లెమ్మల పేరిట ఇంటి పట్టాలను మంజూరు చేసి, పేదల కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని, అర్హతే ప్రామాణికంగా అర్హులైన లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. అమ్మ ఒడి, జగనన్న చేయూత, ఉచిత వైద్య చికిత్స కోసం ఆరోగ్యశ్రీ, వాలింటీర్ల చేత ఉదయాన్నే పింఛన్ల పంపిణీ, ఆటోడ్రైవర్ల కు 10,000, మన బడి నాడు--నేడు ఇలా ఎన్నో పథకాలు ప్రజల జీవన పురోగతి కోసం ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని తెలియజేశారు.
పట్టాల కోసం ఇంకా అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే 90 రోజులపు ఇంటి పట్టాను అందజేస్తామని చెప్పారు. జగనన్న కాలనీల నిర్మాణంలో ఇప్పటికే శంకుస్థాపన చేశామని 17,000 ఇళ్ళను నిర్మించి లక్ష జనాభాకు సరిపడ మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. మేము పాలకులుగా కాకుండా సేవకులుగా ప్రజలకు సేవ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. అంతకుముందు కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ...పట్టా పై ఉండే సంఖ్యలో మొదటలో వచ్చే ఆర్ అనే అక్షరంతో మొదలయే ఉంటే రుద్రవరం గ్రామం వద్ద, టి అని ఉంటే తడకనపల్లె గ్రామంలో ఇంటి స్థలాన్ని కేటాయించిన్నట్లు అని వివరించారు. మొత్తం 377 ఎకరాల లేఅవుట్ ను 39 బ్లాక్కులుగా విభజించడానికి మునిసిపల్, రెవెన్యూ, సర్వే, ప్లానింగ్ సెక్రెటరీలు, సచివాలయ సిబ్బంది అహర్నిశలు శ్రమించారని..వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆదేశాల మేరకు అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి ఇంటి పట్టాలను అందించడానికి కృషి చేశామన్నారు. కార్యక్రమంలో నగర పాలక అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, నగర పాలక ఎస్ఈ సురేంద్రబాబు, కర్నూలు అర్బన్ తహసీల్దార్ తిరుపతి సాయి, డిఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈ రాచయ్య, తాలూకా సిఐ విక్రమ్ సింహ ఉన్నారు.