విద్యార్ధి విభాగం అధ్యక్షునిగా సాయిచరణ్..
Ens Balu
3
Visakhapatnam
2021-01-04 20:51:13
విశాఖపట్నం ఆంధ్రాయూనివర్శిటీ విద్యార్ధి విభాగం అధ్యక్షునిగా పూడిసాయి చరణ్ ను నియమిస్తూ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఉత్తర్వులు అందజేశారు. సోమవారం విశాకలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, ఆంధ్రాయూనివర్శిటీలో యువత సమస్యలను పరిష్కరించడంలోనూ ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలోనూ చురుకుగా పనిచేయాలని చరణ్ కు సూచించారు వంశీ. పార్టీలో పనిచేసేవారికి ఎల్లప్పుడూ గుర్తింపు వుంటుందనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం చరణ్ మాట్లాడుతూ, పార్టీ నగర అధ్యక్షులు తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చడంతోపాటు, ఆంధ్రాయూనివర్శిటీలో పార్టీ అభివ్రుద్ధితోపాటు, యువతను చైతన్య పరిచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షులు తిప్పల వంశీ రెడ్డి , బి కాంత రావు తదితరులు పాల్గొన్నారు.