11న జగనన్న 2 విడత అమ్మఒడి పథకం..


Ens Balu
4
Nellore
2021-01-04 20:57:31

 జగనన్న అమ్మ ఒడి పధక౦ రెండవ విడత కార్యక్రమాన్ని ఈ నెల 11న  రాష్ట్ర ముఖ్యమంత్రి  వై యస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు  జిల్లాలోని  యస్.వి. జి‌. యస్ జూనియర్ కళాశాలలో  ప్రారంభించనున్నారని  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ చెప్పారు. సోమవారం ఈ మేరకు  కళాశాల ప్రాంగణంలో ముఖ్యమంత్రి కార్యక్రమ  ఏర్పాట్లను పరిశీలించారు.        అనంతరం విద్యా శాఖ మంత్రి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ  మందిరం లో జిల్లా అధికారులు , విద్యా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యా శాఖ మంత్రి మాట్లాడూతూ   చదువుకు పేదరికం అడ్డు కాకూడధన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పధకం  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని  అందుకు సంబందించి రెండవ విడత కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంబించటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి  కార్యక్రమం 9 వ తేధీ కాకుండా  11వ తేధీన జరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేధీన 11 గంటలకు ముఖ్యమంత్రి నెల్లూరుకు రావడం జరుగుతుందన్నారు. కోవిడ్ నేపద్యంలో కొన్ని ఇబ్బంధులు ఎదురై రాష్ట్ర ఆధాయ౦ గణనీయంగా తగ్గినప్పటికి ముఖ్యమంత్రి ఈ పధకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.  అర్హులైన ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పధకం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 6వ తీధి నాటికి అర్హుల తుధి జాబితాను తయారుచేయాలన్నారు .  యస్.వి. జి‌. యస్ జూనియర్ కాలేజీ దగ్గరలో వున్న పాఠశాలల విధ్యార్ధులను తగిన జాగ్రత్తలతో ముఖ్యమంత్రి కార్యక్రమానికి తీసుకురావాలని వారికి కావల్సిన అల్పాహారం భోజన సదుపాయాలను కల్పించాలన్నారు .  వీలైనంత ఏక్కువ మందికి ఈ పధకం వర్తించేలా సడలింపులు చేశాం అన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేసి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు .          అనంతరం  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ అన్నీ సంక్షేమ పధకాలకన్నా   జగనన్న  అమ్మ వొడి పధకం గొప్ప పధకం అన్నారు . భారత దేశంలోనే ఎక్కడ  ఇలాంటి పధకం ప్రవేశపెట్టబడలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సారిగా ఇలాంటి గొప్ప పధకాని ప్రవేశపెట్టి రెండవ సంవత్సర౦  కూడా కొనసాగిస్తున్నారన్నారు . అందరూ  కలిసి కట్టుగా పని చేసి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలన్నారు.         అనతరం జిల్లా కలెక్టర్   కె. వి. ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి పధకం క్రింద నెల్లూరు జిల్లాకు సంబందించి 3,46,899 మంధి అర్హత పొంది ఉన్నారన్నారు  . అర్హులైన  అందరికీ ఈ పధకం అందేలా చర్యలు తీసుకూవాలని విద్యా శాఖ వారిని ఆదేశించారు. మొదటి విడతలో  అర్హత వుండి ఈ  పధకం వర్తించని  వారికీ కూడా ఈ పధకం వర్తించేలా చూడాలన్నారు . ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి వచ్చే  పాటశాలల పిల్లల విషయం లో ప్రతి 50 మందికి ఒక టీచర్ ఉండేలా జాగ్రతలు తీసుకోవాలన్నారు . అమ్మ ఒడి నాడు నేడు కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాట్లు చేయాలన్నారు.  ఈ సమీక్ష సమావేశంలో నెల్లూరు రూరల్ శాసనసబ్యులు  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ డా ప్రభాకర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్  దినేష్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్  చిన్న వీర భద్రుడు , రాష్ట్ర  సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమారి వెట్రీ సెల్వి పాల్గొన్నారు.