కల్తీ భోజన మధీనా హోటల్ సీజ్..


Ens Balu
1
Kurnool
2021-01-05 18:35:51

కర్నూలు నగరంలోని యూకాన్ ప్లాజా లోని మధినా హోటల్ లో అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చాలా ఫ్రెష్ గా పాచిపోయి, బూజెక్కి ఉంటాయి..ఇక్కడికి వెళ్లే ఆహార ప్రియులంతా వరుసగా ఆసుపత్రి పాలవడంతో మంగళవారం నగర పాలక ప్రజారోగ్య విభాగం అధికారులు ఈ హోటల్ ను తనిఖీ చేసి సీజ్ చేశారు. బూజుపట్టి..గడ్డకట్టిన చికెన్, పాచిపోయిన మటన్ తో పాటు రెండు రోజుల క్రితం వండిన బిర్యానీ.. బూజు పట్టిన చికెన్ సెర్వా ను ప్రజలకు విక్రయిస్తూన కర్నూలు నగర ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న సదురు దుకాణాన్ని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ ఆదేశాల మేరకు మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి సీజ్ చేశారు. ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే హోటళ్లపై దాడులు ముమ్మరం చేశామని..వాటిని కూడా తప్పక సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. అంతకు  ముందు పలుమార్లు చెప్పిన రహదారిపై తమ దుకాణంలో చెత్త పారబోస్తున్న అలంకార్ ప్లాజా లోని బొంబాయి డైయింగ్ యజమానికి బుద్ధి వచ్చేలా వారి దుకాణంలో చెత్త ను తిరిగి వారి దుకానంలోకే కమిషనర్ గారు పారబోయించారు. తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ యూ.శ్రీనివాసులు ఉన్నారు.