మార్చిలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు..


Ens Balu
3
Srikakulam
2021-01-05 20:06:03

టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు  మార్చిలో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కె. చంద్రకళ  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  డ్రాయింగ్ , హాండ్ లూమ్ వివింగ్ మరియు టైలరింగ్ ఎంబ్రాయీడరీ లోవర్ గ్రేడ్ , హైయర్ గ్రేడ్ పరీక్షలు వ్రాయవలసి ఉంటుందని అన్నారు. ఈ పరీక్షలు వ్రాయు అభ్యర్డులు  www.bseap.gov.in నందు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ ఫారం మరియు  ఛలాన్  లను జిల్లా విద్యాశాఖాధికారి  వారి కార్యాలయం  లో అందజేయవలేనని తెలిపారు.  లోయర్ పరీక్ష పాస్ అయినవారు హయ్యర్  పరీక్ష వ్రాయవచ్చాన్నారు. ఇతర రాష్ట్రల బోర్డ్ ద్వారా పాస్ అయిన అభ్యర్డులు ఈ పరీక్ష వ్రాయటకు సంచాలకులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ , విజయవాడ వారి నుంచి ముందుగా అనుమతి పొందాలన్నారు. ఈ  పరీక్షలు వ్రాయు అభ్యర్డులు పరీక్ష రుసుము   డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ – రూ. 100, డ్రాయింగ్ హైయర్ గ్రేడ్ –రూ.150,  హాండ్ లూమ్ వివింగ్  లోయర్ – రూ.150,  హాండ్ లూమ్ వివింగ్  హైయర్ రూ 200, టైలరింగ్ & ఎంబ్రాయీడరీ లోయర్  రూ.150, టైలరింగ్ & ఎంబ్రాయీడరీ హైయర్ రూ . 200 గా చెల్లించాలన్నారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల  16 వ తేదీ వరకు ఉండగా రూ.  50  అపరాధ రుసుము తో  ఈ నెల  23 వ తేదీ వరకూ  దరఖాస్తు చేసుకొనవచ్చున తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను   ఫిబ్రవరి 3 లోగా  జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.