జీవక్రాంతి పథకం లక్ష్యాలు పూర్తిచేయాలి..
Ens Balu
1
Srikakulam
2021-01-08 21:36:01
జగనన్న జీవక్రాంతి పథకం లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో ఉన్నతి, అమూల్ పాల వెల్లువ కార్యక్రమాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్.సి., ఎస్.టి.లు, నిరుపేద వర్గాలకు అమలు చేస్తున్న ఉన్నతి కార్యక్రమంపై నిర్దేశిత ప్రణాళికలతో లక్ష్యాలను సాధించాలని తెలిపారు. అమూల్ పాల వెల్లువ కార్యక్రమంలో 5 వేల ఆవులు, గేదెల కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు. లబ్దిదారుల ఎంపికను శని వారంలోగా పూర్తి చేయాలన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగాను నిక్కచ్చిగాను చేయాలన్నారు. మంచి ఆరోగ్యంతో కూడిన పశువులను కొనుగోలు చేయాలని వాటికి ట్యాగ్ లు వేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు సుమీత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు,జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, పశు సంవర్ధక శాఖ సంయక్త సంచాలకులు వెంకటేశ్వర్లు, తదితరులు హాజరైనారు.