అప్పన్నను దర్శించుకున్న మంత్రి కుటుంబం..


Ens Balu
3
Simhachalam
2021-01-09 16:15:58

విశాఖ జిల్లా సింహాచలంలోని  శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారిని..రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రిడా  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు   శనివారం  దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి కుటుంబ సభ్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా.. ఆలయ అధికారులు..తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో  సింహాచలం బోర్డ్ సభ్యులు,  స్థానిక నాయకులు , ఆలయ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.