సరుకులు రవాణికి రేషన్ వాహనాలు సిద్దం చేయండి..
Ens Balu
2
Vizianagaram
2021-01-10 16:14:32
ఇంటింటికీ రేషన్ సరుకులను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాలను పంపిణీకి సిద్దం చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్లో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల తనిఖీ, రిజిష్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఒకటిరెండు రోజుల్లో జిల్లాలో వాహనాల పంపిణీని ప్రారంభమవుతుందని, అందువల్ల యుద్దప్రాతిపదికన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. బ్యాంకులతో మాట్లాడి, లబ్దిదారులకు వాహనాల కేటాయింపు పత్రాలను సిద్దంచేసి ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో విజయనగరం డివిజనల్ అభివృద్ది అధికారి కె.రామచంద్రరావు, బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్వి నాగరాణి, సివిల్ సప్లయిస్ డిఎం వరకుమార్, జిల్లా సరఫరా అధికారి పాపారావు, ఎస్సి కార్పొరేషన్, రవాణా, బ్యాంకులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.