గ్రామాల్లో జూన్ వరకూ పారిశుధ్య నిర్వహణ..
Ens Balu
2
Vizianagaram
2021-01-10 16:27:01
విజయనగరం జిల్లాలో గల 960 గ్రామ పంచాయితీలలో పారిశుధ్య నిర్వహణ యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నట్టు జిల్లా పంచాయితి అధికారి కె.సునిల్ రాజ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణపై కార్యదర్శిలకు తగు సూచనలు చేశామన్నారు. మురుగు, ప్లాస్టిక్, ఇతర వ్యర్ధములు తొలగింపు కార్యక్రమములు తరచుగా చేపట్టడంతోపాటు బ్లిచింగ్ చైన్ ఏర్పాటు కూడా చేయిస్తున్నట్టు చెప్పారు. ఎన్ని గ్రామసచివాలయాల్లో పారిశుధ్య నిర్వహణ ఏవిధంగా జరుగుతుందనే విషయమై ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు పర్యవేక్షించాలని కూడా డిపిఓ సూచించారు. ఈ పారిశుధ్య నిర్వహణను ప్రతి రోజు 4, 5 గ్రామాలు స్వయముగా పర్యవేక్షణ చేయాలని సదరు ప్రక్రియ జూన్ నెల వరకు కొనసాగించాలని అందరు కార్యదర్శిలకు ఆదేశాలు జారీచేసినట్టు వివరించారు. గ్రామాలను పరిశుభ్రముగా ఉంచడంతోపాటు ప్లాస్టిక్ ను గ్రామాలో వినియోగించుకుండా చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ అభివృద్ది అధికార్లును, విస్తరాణాధికార్లలకు అప్పగించడంపై జిల్లా కలెక్టర్ ఆదేశించిన విషయాన్ని డిపిఓ తెలియజేశారు.