చిత్తూరు కలెక్టరేట్ లో రేపు స్పందన రద్దు..
Ens Balu
2
Chittoor
2021-01-10 18:26:10
చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ ను నియంత్రించుటలో ముం దస్తు జాగ్రత్తలలో భాగం గా ప్రజలు గుంపులుగా ఉండ కుండా,సామాజిక దూరాన్ని పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితిలో జన వరి 11 న నిర్వహించాల్సి న స్పందన కార్యక్రమాన్ని (గ్రీవెన్స్ డే) తాత్కాలికం గా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ సమస్య ల పరిష్కారం కొరకు జిల్లా సచివాలయానికి రావాలనుకున్నవారు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ముఖ్యంగా ఏ గ్రామానికి చెందిన సమస్యలు ఆ గ్రామంలోని గ్రామసచివాలయంలోని దరఖాస్తు చేసుకొని సమస్య పరిష్కారం పొందాలని కూడా కలెక్టర్ వివరించారు. గ్రామసచివాలయంలో పరిష్కారం కాని సమస్యలపై మాత్రమే జిల్లా సచివాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు.