జర్నలిస్టులు ఉన్నత విలువలతో పనిచేయాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-01-10 20:22:42
పాత్రికేయలు విలువలు కోల్పోకుండా నిజాయితీతో వార్తలు రాయాలని,సమాజంలో ఉన్నతంగా చూసేది జర్నలిస్టులనేనని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. విశాఖలో ఆదివారం జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) 14 వ ద్వైవార్షిక సమావేశం రాష్ట్ర స్థాయి విశాఖ యూనిట్ ఉపాధ్యక్షుడు కే.ఎమ్.కీర్తన్ ఆధ్వర్యంలో వెబినార్ ద్వారా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా గవర్నర్ దత్తాత్రేయ పాల్గొని జాప్ సభ్యులందరికీ పలు సూచనలు చేశారు. ఎన్నికల అధికారి,ఎన్ యూ జె ఉపాధ్యక్షుడు ఎన్.నాగేశ్వర రావు జాప్ నూతన రాష్ట్ర వర్గ కార్యవర్గాన్ని ప్రకటించి,సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఎన్ యూ జె అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి కూడా వెబినార్ ద్వారా సమావేశంలో పాల్గొని కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గానికి అభినందనలు తెలియచేసారు. ఆంధ్రప్రదేశ్ లో జాప్ కు అన్నివిధాలా అందదండ లందిస్తాయని హామీ ఇచ్చారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ, యూనియన్ సభ్యులకు అన్నివిధాలా న్యాయంజరిగేలా పోరాడతామన్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రవీంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జాప్ పటిష్ఠతకు కృషిచేస్తానన్నారు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగకుండా నిరంతరం పోరాటం చేస్తానన్నారు. నూతన కార్యదర్శి బి.ఎస్.ఎస్.శశి మాట్లాడుతూ, జాప్ సబ్యులకు న్యాయంజరిగేలా అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతామన్నారు. ముఖ్యంగా అక్రిడిటేషన్లపై అధికారులతో చర్చించి అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు మంజూరు జరిగేలా కృషిచేస్తామన్నారు. ఎంతోకాలంగా ప్రభుత్వాలు హామీ ఇచ్చిన ఇళ్ల స్థలాలపైకూడా పోరాడతామన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన జాప్ తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడు రమణ రావు మాట్లాడుతూ, జరలిస్టులపై ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నతీరు సరికాదన్నారు. శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. విశాఖ యూనిట్ ఉపాధ్యక్షుడు కీర్తన్ మాట్లాడుతూ, ఉప్పల లక్ష్మణ్ మార్గదర్శ కత్వంలో,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి, కార్యనిర్వహాక కార్యదర్శి పాత్రుడు సలహాలు,సూచనల మేరకు విశాఖ యూనిట్ తరపున పలు కార్యక్రమాలు చేపట్టేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో విశాఖ యూనిట్ కార్యదర్శి కాశీ,ఉపాధ్యక్షుడు రవికుమార్,కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మోహన్,కోశాధికారి ప్రసాద్, నాయకులు రఘు,రవి కుమార్, మదన్,రాజు,కృష్ణ,మోహన్,శ్యాం, రాము,రామకృష్ణ,రామారావు తదితరు పాల్గొన్నారు.