విశాఖలో ఘనంగా పైలాశివతేజ వర్ధంతి..
Ens Balu
4
Visakhapatnam
2021-01-16 23:25:20
విశాఖలో జర్నలిస్టు దివాకర్ తనయుడు పైల శివతేజ వర్ధంతి శనివారం ఘనంగాా నిర్వహించారు. ప్రతీఏటా శివతేజ వర్ధంతి సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో నిరుపేదలకి అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు దివాకర్ దంపతులు నగరంలోని రైల్వే న్యూకాలనీలోని పలువురు అనాధలకు అల్పాహారం అందించారు. అనంతరం షిర్డీసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ, ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలికి మంచి డ్రైవింగ్ నేర్పించిన తరువాత మాత్రమే వాహనాలు అందించటం అలవాటు చేసుకోవాలన్నారు. డ్రైవింగ్ ను ప్రోత్సహించవద్దని కోరారు. పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే వారికిచ్చే వాననాలు, డ్రైవింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తన కొడుకులా మరో కుటింబానికి పిల్లలు వాహన ప్రమాదంలో దూరం కాకుండా ఉండాలని దేవాది దేవతలను కోరుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆయన భార్య పాల్గొన్నారు.