పాలకొండలో పోలీసులకు కోవిడి19 పరీక్షలు..
Ens Balu
3
Srikakulam
2020-08-13 20:21:24
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పోలీసులకు ప్రత్యేకంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఇన్ స్పెక్టర్ ఆదాం తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు పాలకొండ జూనియర్ కాలేజ్ లో పోలీసులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. 24 మంది పోలీసులు వారి కుటుంబ సభ్యులుకు కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. గతంలో ఒక హెడ్ కానిస్టేబుల్ కరోనా వైరస్ సోకందిని, శ్రీకాకుళం జెమ్స్ కు తరలించి వైద్యం అందించామని అన్నారు. కరోనా నుండి కోలుకుని విధులకు హజరయ్యారని తెల్పారు. కోవిడ్ పరీక్షలలో పాజిటివ్ వచ్చినంత మాత్రానా కలత చెందవద్దని, దైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న నియమాలు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సానిటైజ్ చేసుకోవాలని పిలుపు నిచ్చారు. సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.