ప్రభుత్వ శాఖల్లో మంచిసేవలు అందించాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-01-19 19:21:34

ఆయా శాఖలలో నియమించిన వారంతా మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ సూచించారు.  మంగళవారం సర్క్యూట్ హౌస్ లో విభిన్న ప్రతిభా వంతులకు ఆయన 14 మందికి నియామక పత్రాలు అందజేశారు.  ఆయా శాఖలలో నియమించిన వారంతా  మంచి సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇందులో జూనియర్ సహాయకులుగా ఐదు (5), టైపిస్టులుగా రెండు (2), ఆఫీసు సబార్డినేట్ లుగా రెండు (2), స్వీపర్ ఒకటి (1), వాచ్మెన్ ఒకటి (1), క్లీనర్ కమ్ స్వీపర్ ఒకటి (1), మజ్దూర్ ఒకటి (1), పిహెచ్ వర్కర్ ఒకటి (1) ఆయా ప్రభుత్వ శాఖలలో నియమించినట్లు ఆయన తెలిపారు. ఇందులో డి.ఎస్.సి. గ్రూప్ - 4 క్రింద 7 పోస్టులు, ఒ.డి.ఎస్సి. క్లాస్ - 4 క్రింద 7 పోస్టులు నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జివిఆర్ శర్మ పాల్గొన్నారు.