మత్య్సకారులు సంయనం పాటించాలి..


Ens Balu
4
Visakhapatnam
2021-01-19 19:27:37

సాంకేతిక నివేదిక వచ్చేంత వరకు ఇరు వర్గాల మత్య్సకారులు సంయనం పాటించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.  మంగళవారం  సర్క్యూట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నగర పోలీసు కమీషనర్ మనీష్ కుమార్ సిన్హ లతో కలసి రింగు వలలు, గిల్ నెట్ (సాంప్రదాయ మత్య్సకారుల మధ్య వివాద పరిష్కారంపై సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివాద పరిష్కారం కోసం టెక్నికల్ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత తగు నిర్ణయం ఉంటుందని, అంత వరకు ఇరు వర్గాల మత్య్సకారులు సంవయంనం పాటించాలని, ప్రభుత్వ ఉత్తరవులనల గౌరవించాలని ఆయన కోరారు.  ఈ సమావేశంలో దక్షిణ నియోజక వర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్-1 ఎం. వేణుగోపాల్ రెడ్డి, మత్య్సశాఖ సంయుక్త సంచాలకులు డా. ఫణి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.