2వరోజు కొనసాగిన సంక్రాంతి కనుకలు..
Ens Balu
1
Andhra University
2021-01-19 19:57:21
వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు అందించిన సంక్రాంతి కానుకలను మంగళవారం సైతం ఏయూ జిమ్నాజియం మైదానంలో పంపిణీ చేశారు. సంక్రాంతి కానుకలు స్వీకరించిన జర్నలిస్టులు సంతోషం వ్యక్తంచేశారు. విజెఎఫ్ అద్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరుకు విజయసాయి రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమానికి సైతం విజయసాయి రెడ్డి విచ్చేసి పాత్రికేయులపై తన అభిమానాన్ని చాటారన్నారు. కార్యక్రమంలో విజెఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు, విజయసాయి రెడ్డి మీడియా సమన్వయ అధికారి జి.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజెఎఫ్ కార్యవర్గ సభ్యులు నాగరాజు పట్నాయకర్, దాడి రవికుమార్, ఈశ్వర రావు, తదితరులు సమన్వయం చేశారు.