ఆ కలెక్టర్ మినీ ట్రక్కు నడిపారండోయ్..
Ens Balu
2
Vijayawada
2021-01-20 12:19:38
ఆ జిల్లా కలెక్టర్ కి రియాలిటీ చాలా ఎక్కువ..ఏదైనా స్వయంగా పరిశీలిస్తే తప్పా ఒక అంచనాకు రారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటి వద్దకే తరలించే రేషన్ సరుకుల మినీ ట్రక్కులను పరిశీలించిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. రేపు ముఖ్యమంత్రి ప్రారంభించనున్న ఈ మినీట్రక్కుల పనితీరును క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్.. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో స్వయంగా ట్రక్కు నడిపి మరీ తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలో పంపిణీ చేసే ట్రక్కులు, రేటి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 1 నుంచి ప్రతీఇంటికీ రేషన్ సరుకులు మినీ ట్రక్కుల ద్వారానే పంపిణీ చేయనున్నామన్నారు. దానికోసం ట్రక్కులు వాటిని నిర్వహణ చూసే వారి జాబితాలు మొత్తం సిద్దం అయ్యాయని పేర్కొన్నారు. ట్రక్కులను ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం జిల్లాలోనూ పంపిణీ చేపడతామన్నారు. ట్రక్కులోనే త్రాసు కూడా ఏర్పాటు చేశారని, ప్రజలకు ఏమైనా సరుకు బరువుల్లో తేడా వస్తే త్రాసులో బరువు కూడా చెక్ చేసుకోవచ్చునని చెప్పారు.