ఆలయాల భద్రతకు ప్రజలు సహాకరించాలి..


Ens Balu
2
Sanjamala
2021-01-20 13:17:45

ఆలయాల భద్రతకు ప్రజలు సహకరించాలని ఆళ్లగడ్డ డిఎస్పీ రాజేంద్ర స్పష్టం చేశారు. బుధవారం కర్నూలు జిల్లాలోని సంజామల మండలంలోని నొస్సం గ్రామంలోని బుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఆలయాలపై దాడులు జరగకుండా ఉంటాయన్నారు. దానికోసం ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామస్తు కలిసికట్టుగా ఉంటం ద్వారానే ఆలయాలపై జరుగుతున్న దాడులను పసిగట్టడానికి అవకాశం వుంటుందన్నారు. అదేసమయంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టాలని చూసే దుండగుల చర్యలను నియంత్రించడానికి వీలుపడుతుందని చెప్పారు. అనంతరం గ్రామస్థుల సహకారం ఏర్పాటు చేయబోయే పోలీసు ఔట్ పోస్టుకి ఆయన భూమి పూజ చేసి, స్వామివారి ఆలయాన్ని, చుట్టు ప్రక్కల ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారాయుడు, ఎస్సై తిమ్మారెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.