గర్భిణీలకు, తల్లులకు పౌష్టికాహారం..
Ens Balu
3
Srikakulam
2021-01-20 20:09:57
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు నాణ్యమైన పోషకాహారాన్ని ఖచ్చితంగా అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఐ.సి.డి.ఎస్. అధికారులకు తెలపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వై ఎస్ ఆర్ పోషణ, సంపూర్ణ పోషణ కార్యక్రమంపై ఐ.సి.డి.ఎస్. అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నుండి అంగన్వాడీ కేంద్రాలు యధాతథంగా పనిచేయాలని చెప్పారు. పిల్లలకు, గర్భిణీలకు, పాలుచ్చే తల్లులకు, మెనూ ప్రకాకం పోషకాహారాన్ని అందించాలన్నారు. అదే విధంగా పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, అన్ని కేంద్రాలలోను పిల్లల బరువు తూచే వెయింగ్ మెషీన్లు పని చేయాలన్నారు. పిల్లల పొడుగు కొలిచే స్కేల్స్ సరిగా ఉండాలన్నారు. కేంద్రాలను పర్యవేక్షించు సమయంలో సరిగా పని చేయనివి కనిపిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. మెనూ ననుసరించి ఖచ్చితంగా నాణ్యమైన, పోషకాహారాన్ని ఆహారాన్ని అందించాలన్నారు. కేంద్రాలలో రెగ్యులర్ గా వేసే టీకాలు, వేక్సిన్ లను తప్పకుండా వేయాలన్నారు. తక్కువ బరువు వున్న పిల్లలపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలన్నారు. అనంతరం అంగన్వాడీ భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. జిల్లాలో వున్న 4192 అంగన్వాడీ కేంద్రాలలో 1205 కేంద్రాలకు స్వంత భవనాలున్నాయని, 1768 కేంద్రాలు అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారని, అద్దె లేకుండా 1219 కేంద్రాలు పని చేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలను నిర్మించడం జరుగుతున్నదని, నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఐ సి డి ఎస్ పి డి జయదేవి., డి.సి.పి.ఓ. రమణ, సి డి పి ఓ లు, సూపర్ వైసర్ లు, తదితరులు పాల్గొన్నారు.