ఉత్తరాంధ్రాలో రోడ్లకు 4 వేల కోట్లు..
Ens Balu
3
Vizianagaram
2021-01-20 20:24:13
విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర అబివృద్ధి కి 4 వేల కోట్ల తో పలు జాతీయ రహదారులను నిర్మించనున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు తెలిపారు. భూ సేకరణ సమీక్ష అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. విశాఖపట్నం నుండి రాయిపూర్, బౌడర నుండి రాజమండ్రి వరకు , పలు బై పాస్ రహదారులను 388 కిలో మీటర్ల మేరకు నిర్మించనున్నట్లు తెలిపారు. 200 కిలో మీటర్ల కు ప్రపంచ బ్యాంకు సహాయం చేస్తుందని, 188 కిలో మీటర్ల కోసం రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి గారిని కోరగా మంజూరు చేసారని అన్నారు. ఇప్పటికే చాల వరకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, భూ సేకరణ 90 శాతం పూర్తయితే మిగిలిన పనులకు కూడా టెండర్ లనుపిలవడం జరుగుతుందని తెలిపారు. కాంట్రాక్టర్ లు సిద్ధంగా ఉన్నారని, గ్రౌన్దింగ్స్ వేగవంతం చెయ్యాలని అధికారులకు సూచించామని అన్నారు. విశాఖ పట్నం నుంచి భోగాపురం వరకు కోస్టల్ కారిడార్ 50 కిలో మీటర్ల మేర చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి డి.పి.ఆర్ కూడా సిద్ధం అయ్యిందన్నారు. రహదారుల పనులన్నీ పూర్తి చేసి, ఎయిర్ పోర్ట్ తో కనెక్టివిటీ ని పెంచుతామని, దాని వలన ప్రజలకు అత్యుతమ కమ్యూనికేషన్ తో పాటు ట్రాన్స్ పోర్ట్టేషన్ అందించడం జరుగుతుందని అన్నారు. అతి త్వరలో నిధులను సమకూర్చుకొని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని తెలిపారు.