నిబంధనలు పాటిస్తూనే వేక్సినేషన్..
Ens Balu
2
Visakhapatnam
2021-01-23 14:11:57
కోవిడ్ వేక్సినేషన్ వేసే సమయంలో వైద్యసిబ్బంది, అధికారులు, పర్యవేక్షులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ఆదేశించారు. శనివారం జివిఎంసి పరిధిలోని 17వ వార్డులో గల ఇ.ఎన్.టి. ఆసుపత్రిలోగల కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ ను జివిఎంసి అదనపు కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ వేక్సినేషన్ అందించే ప్రక్రియలో భాగంగా ఇ.ఎన్.టి. ఆసుపత్రిలో ఫ్రంట్ లైన్ వారియర్సుకు, ముఖ్యంగా ఆరోగ్య అధికారులు, సిబ్బందికి అందిస్తున్న వేక్సినేషన్ ఏ విధంగా జరుగుతుందో వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేక్సిన్ తీసుకున్న సిబ్బందితో ముచ్చటించారు. వేక్సినేషన్ అనంతరం కూడా నియమిత కాలం వరకు కోవిడ్ నిబంధనలు పాటించాలని సిబ్బందికి హితవు పలికారు. ఆసుపత్రిలో వేక్సిన్ నిల్వఉంచిన ప్రదేశంలో విద్యుత్ కి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. జనరేటర్ దగ్గర ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.