అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర మంత్రి..


Ens Balu
4
Visakhapatnam
2021-01-23 14:32:49

విశాఖలోని  సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబం శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి  సతీమణి జ్ఞానేశ్వరి ,కుమారుడు శివ నందీశ్, కుమార్తె లక్ష్మీ ప్రియాంక, అల్లుడు శ్రావణ్ కుమార్, ఆలయ ఈవో వెంకటేశ్వరరావు , సింహాచలం బోర్డ్ సభ్యులు,  స్థానిక నాయకులు , ఆలయ అధికారులు  పాల్గొన్నారు.