ఘనంగా గుణసాయితేజ జన్మదినోత్సవం..
Ens Balu
2
Rajahmundry
2021-01-23 20:05:06
అన్నిదానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని రాజమండ్రిలోని ప్రముఖ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కాకిరవిబాబు అన్నారు. శనివారం ఆయన కుమారుడు గుణసాయితేజ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని సేవ తపన సొసైటీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, తమకుటుంలో ఎవరి జన్మదినోత్సం జరిగినా, ఆరోజు ఖర్చేచేయాలనుకున్న డబ్బులతో తమవంతుగా నిరుపేదలకు ఒక్కపూట భోజనం పెట్టడానికి ఖర్చు చేస్తామన్నారు. తామే స్వయంగా వంటచేసుకొని అనాధలకు ఆరోజు భోజనం పెడతామని చెప్పారు. తమ తల్లిదండ్రులు నేర్పిన ఈ అలవాటును తమ జీవితాంతం కొనసాగిస్తామని రవిబాబు చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముందు సాయిబాబావారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సువార్తకులు, దైవదూత ఏసుదాసు, జ్యోతి, ప్రియాంక, గుణసాయితేజ తదితరులు పాల్గొన్నారు.