సచివాలయంలోనే సేవలన్నీ అందాలి..
Ens Balu
3
Srikakulam
2021-01-23 20:08:33
సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించడంలో సిబ్బంది ముందుకు రావాలని కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గల చంపాగల్లివీధి, మంగువారితోటలోని వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేసారు. వార్డు సచివాలయంలో నిర్వహిస్తున్న రిజిష్టర్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేసారు. అనంతరం కలెక్టర్ సిబ్బందితో మాట్లాడుతూ వార్డు సచివాలయాలకు వచ్చే ఆర్జీదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించి వార్డు ప్రజల మన్ననలను పొందాలని సూచించారు.వార్డు సచివాలయంలోని రిజిష్టర్లను ఎప్పటికపుడు నమోదుచేస్తూ ఉండాలని, అధికారులు తనిఖీలకు వచ్చినపుడు రిజిష్టర్లను అందజేయాలని ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో సహాయ కమీషనర్ కె.శివప్రసాద్ , టి.పి.ఆర్.ఓ జగన్ మోహన్ , నగరపాలక ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.