దక్షిణ వైఎస్సార్సీపీలోకి వేలాదిగా చేరికలు..
Ens Balu
3
Visakhapatnam
2021-01-23 22:12:37
వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇన్నివేల మంది పార్టీలోకి చేరడం ఎంతో ఆనందంగా వుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.శనివారం జిల్లా పరిషత్ అంకోసాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిడిపి, బీజేపీ, జనసేన తదితర పార్టీల నుంచి సుమారు 2వేల మంది మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లక్ష్యం ఒక్కటే దేశంలోనే బెస్ట్ స్టేట్ టా ఏపీని తీర్చిదిద్దడమేనన్నారు. అందులో భాగంగానే ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా 26 మంది వైద్యులతోపాటు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నజిగిషా అనే మెడికో పార్టీలో చేరడం మరువలేని విషయమని అన్నారు. అంతేకాకుండా 62 మంది బూత్ లెవల్ ప్రెసిడెంట్టు కూడా పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే చెప్పారు. వీరితోపాటు ఇద్దరు న్యాయవాదులు చేరారని, వీరంతా మంచి పండుగ వాతావరణంలో పార్టీలోకి చేరడంతో అంకోసా మొత్తం కోలాహలంగా తయారైంది. పార్టీలోకి చేరిన వారందరినీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. వీరంతా పార్టీని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఎమ్మెల్యే. కార్యక్రమంలో దక్షిణ నియోజవర్గ నాయకులు, కార్పోరేట్ అభ్యర్ధులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.