త్యాగధనులను సేవలను మరువరాదు..జిల్లా జడ్జి
Ens Balu
6
Srikakulam
2020-08-15 19:38:14
శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు కృషి చేసారన్నారు. మహాను భావుల త్యాగ ఫలాలు జాతి మొత్తానికి అందుటకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్ మహమ్మార వ్యాప్తి బాగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోవిడ్ భారీన పడిన తల్లిదండ్రుల వద్దకు పిల్లలు వెల్లడం, పిల్లలు వద్దకు తల్లిదండ్రులు వెళ్ళడం వంటి పరిస్ధితి లేకుండా పోయిందని అన్నారు. అయితే ఎటువంటి వివక్ష అవసరం లేదని అప్రమత్తంగా ఉండటమే ప్రధానమని చెప్పారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు చక్కగా పనిచేసారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ప్రాణాయామం, యోగా సాధన చేయడం అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన డి.ఎం.హెచ్.ఓ కార్యాలయం ఐడిఎస్పి డా.కె.అప్పారావు, ఎం.ఎన్.ఓ ఎం.పురుషోత్తం, హోమ్ గార్డు రమణలను సత్కరించారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రమేష్ బాబు జెండ్ ఎగుర వేసారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.