ప్రభుత్వం ద్రుష్టికి జర్నలిస్టుల సమస్యలు..
Ens Balu
3
Visakhapatnam
2021-01-24 13:13:55
ప్రభుత్వం ద్రుష్టికి వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలను తీసుకెళ్లడంతోపాటు, తాను అండగా ఉంటానని వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకెరాజు అన్నారు. ఆదివారం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్-2021 రాష్ట్ర డైరీని అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్, జర్నలిస్టు ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన వినతిని, పేర్కొన్న సమస్యలను నిశితంగా పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా వున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా వుందని, అయినప్పటికీ కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్ లోనే ఉండిపోయాయనే మీ ద్వారా మరోసారి తెలుసుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టులంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు గృహ వసతి కల్పించాలని, అదేవిధంగా భీమా సౌకర్యం కల్పించి, ఇన్స్యూరెన్సు సౌకర్యాన్ని కూడా కల్పించాలన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన జర్నలిస్టులకు కరోనా వేక్సిన్ ను వేయాడానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని కోరారు. వృత్తి పరంగా అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వ పరంగా ఆదుకుంటే తప్పా జర్నలిస్టుల సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు తొలగే సమస్య లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పద్మజ, ప్రభాకర్, సూర్య, మాధవి, జుబేర్, దేవిశ్రీ, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.