సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..
Ens Balu
3
Vijayawada
2021-01-24 16:23:23
జర్నలిస్టులు వాస్తవాలను ఆధారాలతో సహా బయటకు వెలికితీసినపుడే సమస్యల పరిష్కారానికి, అవినీతిని నియంత్రించడానికి వీలుపడుతుందని హోమంత్రి మోకతోటి సుచురిత అన్నారు. ఆదివారం విజయవాడ లోని హోటల్ ఐలాపురం నగేష్ బూర్తి రచించిన ఒక జర్నలిస్టు ప్రయాణం అనే పుస్తకాన్ని హోంమంత్రి సుచరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వానికి కేవలం జర్నలిస్టులు మాత్రమే వారధులుగా ఉంటారని, జర్నలిస్టులవలనే బాహ్య ప్రపంచంలో జరిగే అన్ని అంశాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. అలాంటి జర్నలిస్టులు ఎంతో నిబద్దతతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించడానికా ఆస్కారం వుంటుందని అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలమని అన్నారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత జర్నలిస్ట్ సుబ్రమణ్యం, జెఎజె జాయింట్ సెక్రటరీ కొండలరావు, ఏపిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజినేయులు, సీనియర్ జర్నలిస్ట్ చెన్ను పెద్దిరాజు, రచయిత జాన్సన్, గోపి, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.