శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌..


Ens Balu
3
Tirumala
2021-01-24 18:12:33

తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ గవర్నర్‌ త‌మిళి సై సౌంద‌ర్య రాజ‌న్ కుటుంబ స‌మేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చక బృందం కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. గవర్నర్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో  వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, డైరీ, క్యాలెండ‌ర్‌ అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డిప్యూటీ ఈవో  హరీంద్రనాథ్, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో బాలాజి, పేష్కార్  జ‌గ‌న్మోహ‌నాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.