సీఎం ద్రుష్టికి వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు..
Ens Balu
2
Visakhapatnam
2021-01-25 13:35:16
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ద్రుష్టికి వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్లడంతోపాటు, తాము అండగా ఉంటానని వైఎస్సార్సీపీ విశాఖ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పేర్కొన్నారు. సోమవారం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్-2021 రాష్ట్ర డైరీని అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్, జర్నలిస్టు ప్రతినిధులతో కలిసి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కరమాని విజయ నిర్మల మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తో మాట్లాడి సమస్య పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన వినతిని, ప్రస్తావించిన సమస్యల స్వయంగా జర్నలిస్టులను పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రజాప్రతినిధులగా తమపై ఉందని అన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నామని ఆమె భరోసా ఇచ్చారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించే విషయంలో తోడుంటామని చెప్పారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ పెద్దలంతా ఎంతో సముఖుంగా ఉన్నారని అక్కరమానికి వివరించారు. జర్నలిస్టులకు గృహ వసతి, భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పద్మజ, ప్రభాకర్, సూర్య, మాధవి, జుబేర్, దేవిశ్రీ, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.