పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవం..
Ens Balu
3
Anantapur
2021-01-25 17:50:48
అనంతపురం జిల్లాలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం స్థానిక అనంతపురం పోలీస్ పరేడ్ మైదానం వేదికగా జరగనున్నాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం పరేడ్ సమీక్ష, జిల్లాలో ప్రగతి నివేదికపై తన ప్రసంగం, సాంస్కృతిక కార్యక్రమాలు, విశిష్ట సేవలు అందించిన వారికి ప్రశంసా పాత్రలు జారీ చేయడం వంటి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్టాల్స్ సందర్శనతో పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగించి, కొనసాగింపుగా సాయంత్రం ఆరు గంటల నుంచీ లలిత కళా పరిషత్తులో జాతీయ సమైక్యతపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.