సుస్థిర నిర్మాణాలను జరపాలి..
Ens Balu
5
Visakhapatnam
2021-01-25 18:05:44
పటిష్టమైన సుస్థిర నిర్మాణాలను జరపాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఏఐసిటిఇ సంయుక్తంగా ‘షాలో అండ్ డీప్ ఫౌండేషన్’ అంశంపై నిర్వహిస్తున్న రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ పోగ్రామ్ను ఆయన ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో బహుళ అంస్థుల భవనాల నిర్మిణం, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు నిర్మాణాలు పెరిగాయన్నారు. వీటి నిర్మాణంలో నేల స్వభావాన్ని పరిక్షీంచే సాంకేతిక విధానాలు కలిగి ఉండటం, తదునుగుణంగా అవసరమైన ఫౌండేషన్ (పునాది)ని వేసుకోవడం ఎంతో అవసరమన్నారు. ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఎంతో ఖ్యాతి గాంచిందని, షాలో, డీప్ ఫౌండేషన్ల నిర్మాణంలో వీరి నిపుణతను ఉపయోగించుకోవాలని సూచించారు. విభాగాధిపతి ఆచార్య టి.వి ప్రవీణ్ మాట్లాడుతూ అధ్యాపకులు, ఆచార్యుల బోధన పటిమను, జ్ఞానాన్ని వృద్ది చేసుకోవడానికి ఎఫ్డిపి ఉపకరిస్తుందన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఐఐటి గాంధీనగర్ ఎమిరిటస్ ప్రొఫిసర్ ఆచార్య జి.వి రావు, ఆచార్య కె.ఎస్ బీన తదితరులు ప్రసంగించారు. రెండు వారాల ఎఫ్డిపిలో భాగంగా విశిష్ట ఆచార్యుల ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్నట్లు సదస్సు సమన్వయకర్త ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఎఫ్డిపిలో 120 మంది అధ్యాపకులు, ఇంజనీర్లు, పరిశోధకులు దేశం నలుమూలల నుంచి పాల్గొంటున్నారన్నారు.