త్యాగధనుల లక్ష్య సాధనకు క్రుషి చేయాలి...ఉమాకాంత్


Ens Balu
4
Visakhapatnam
2020-08-15 20:42:26

భారదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి త్యాగధనులు చేసిన త్యాగాలను గుర్తించి వారి ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ క్రుషి చేయాలని సాక్షి విశాఖ యూనిట్ బ్యూరో చీఫ్ గరికపాటి ఉమాకాంత్ అన్నారు. శనివారం విశాకలోని సాక్షి యూనిట్ లో నిర్వహించిన 74వ స్వాతంత్ర్య దినోత్సవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను జాతీకోసం త్రుణప్రాయంగా వదిలాన్నారు. వారిని నిత్యం స్మరిస్తూ, దేశాభివ్రుద్ధికి పాటుపడాలన్నారు. ప్రతీఒక్క జర్నలిస్టు రాష్ట్ర అభివ్రుద్ధిలో కీలక పాత్ర పోషించే విధంగా తమ విధినిర్వహణ చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ విజ్రుంభిస్తున్న వేళ జర్నలిస్టులు సామాజిక దూరం పాటిస్తూనే ముఖ్యమైన వార్తలకు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో యూనిట్ సిబ్బంది, జర్నలిస్టులు పాల్గొన్నారు.
సిఫార్సు